
చెన్నూరుకి చెందిన మైనర్ బాలుడు గంజాయికి బానిసవడంతో పోలీసులు మంగళవారం డీ-అడిక్షన్ సెంటర్కు తరలించారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చుకుని సేవిస్తున్న సదరు బాలుడిపై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రవర్తన మార్చుకోకుండా నిత్యం మత్తుకు బానిస కావడంతో, పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో గంజాయి తాగినట్లు తేలడంతో కౌన్సెలింగ్, చికిత్స నిమిత్తం పునరావాస కేంద్రానికి పంపారు.


