మంచిర్యాల జిల్లా// జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేగుంట పోచయ్య (65) తన పొలంలో వరి కొయ్యలను కాల్చివేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వాటిని అదుపు చేసే ప్రయత్నంలో పోచయ్య మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంచిర్యాల జిల్లా// అగ్ని ప్రమాదంతో రైతు మృతి
RELATED ARTICLES


