కేరళంలోని తిరువనంతపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్నకొడుకుని చంపింది. ఏడాదిన్నర పసికందును సుమారు 51 సార్లు గాయపరిచి, సిగరెట్లతో కాల్చి తీవ్రంగా హింసించింది. ఈ కేసులో నిందితులైన చిన్నారి తల్లి అఖిల, ఆమె లివ్-ఇన్ పార్ట్నర్ అష్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. పసిబిడ్డ వాంతులు చేసుకుంటోందని అష్కర్ ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు గాయాలను గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే బాలుడిని చంపినట్లు తెలుస్తోంది.
51 సార్లు సిగరెట్లతో కాల్చి.. కన్నకొడుకుని చంపిన తల్లి
RELATED ARTICLES


