Homeమంచిర్యాల జిల్లా వార్తలుభారత్ అసాధారణ అణు విజయం! రష్యా తర్వాత మనమే.. గర్వించదగ్గ క్షణం!

భారత్ అసాధారణ అణు విజయం! రష్యా తర్వాత మనమే.. గర్వించదగ్గ క్షణం!

ప్రపంచ దేశాలు లక్షల కోట్లు ఖర్చు చేసినా సాధ్యం కాని అరుదైన ఘనతను భారత శాస్త్రవేత్తలు సాధించారు! తమిళనాడులోని కల్పక్కం అణు విద్యుత్ కేంద్రంలో ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) ఏప్రిల్ 6న విజయవంతంగా ‘క్రిటికాలిటీ’ సాధించింది. 🛡️⚡

ప్రపంచం విఫలమైన చోట భారత్ విజయం!
ఈ టెక్నాలజీ కోసం అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు దశాబ్దాలుగా ప్రయత్నించి, వేల కోట్లు ఖర్చు చేసి చివరకు చేతులెత్తేశాయి. ప్రస్తుతం వాణిజ్య స్థాయిలో ఈ రియాక్టర్లను నడుపుతున్న ఏకైక దేశం రష్యా. ఇప్పుడు ఆ సరసన భారత్ చేరి అగ్రరాజ్యాలకు షాక్ ఇచ్చింది!

అసలు ఏంటి ఈ ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ స్పెషాలిటీ?
అద్భుతమైన టెక్నాలజీ: ఇది తను వాడే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది! (Magic, isn’t it? ✨)

థోరియం పవర్: మన దేశంలో పుష్కలంగా ఉన్న థోరియం నిల్వలను ఉపయోగించుకుని విద్యుత్ తయారు చేసే రెండో దశలోకి భారత్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.

స్వయం సమృద్ధి: విదేశీ యురేనియం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఇక తగ్గుతుంది.

💎 1950ల్లోనే కనుగొన్న మూడు అంచెల అణు వ్యూహం నేడు వాస్తవరూపం దాల్చుతోంది.
ఈ ఒక్క రియాక్టర్ ద్వారా దాదాపు 30 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా, కాలుష్యం లేని విద్యుత్ అందుతుంది.
వచ్చే 300-400 ఏళ్ల వరకు భారత్ ఇంధన అవసరాలకు డోకా ఉండదు!

ఎందుకు మిగతా దేశాలు ఫెయిల్ అయ్యాయి?
ఈ రియాక్టర్లలో నీటికి బదులు ద్రవ సోడియంను కూలెంట్‌గా వాడతారు. ఇది గాలితో కలిసినా మండుతుంది. దీన్ని నియంత్రించడం అత్యంత కష్టమైన పని. అందుకే అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు ప్రమాదాల వల్ల వెనక్కి తగ్గాయి. కానీ మన భారతీయ ఇంజనీర్లు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

క్విజ్

- Advertisement -spot_img

Most Popular